Posted on 2026-03-29 11:13:27
డైలీ భారత్, ఖమ్మం: ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 2 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందుతులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపార వేత్త కి వాట్సాప్ లో పరిచయమైన వ్యక్తులు ఆన్లైన్ లో Fx Pro కంపెనీలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో గాను 7 లక్షలు రూపాయిలు అక్కౌంట్ కి వెళ్ళిన అక్కౌంట్ హోల్డర్స్ అయిన ఎండి. సాదిక్ (35సం), శ్యామ్ బాబు (21సం) లను , తణుకు లో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డిఎస్పీ, CH.R.V. ఫణిందర్, ఇన్స్పెక్టర్ కొండపర్తి నరేశ్ , ఎస్సై రoజిత్ కుమార్ , కానిస్టేబుల్స్ వెంకట కృష్ణరావు ,కిషన్ రావు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >