Posted on 2026-03-29 11:13:27
డైలీ భారత్, ఖమ్మం: ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 2 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందుతులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపార వేత్త కి వాట్సాప్ లో పరిచయమైన వ్యక్తులు ఆన్లైన్ లో Fx Pro కంపెనీలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో గాను 7 లక్షలు రూపాయిలు అక్కౌంట్ కి వెళ్ళిన అక్కౌంట్ హోల్డర్స్ అయిన ఎండి. సాదిక్ (35సం), శ్యామ్ బాబు (21సం) లను , తణుకు లో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డిఎస్పీ, CH.R.V. ఫణిందర్, ఇన్స్పెక్టర్ కొండపర్తి నరేశ్ , ఎస్సై రoజిత్ కుమార్ , కానిస్టేబుల్స్ వెంకట కృష్ణరావు ,కిషన్ రావు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >