| Daily భారత్
Logo




ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-03-29 13:28:07

Share: Share


ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో పట్టణంలో  స్వీట్ పంపిణి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇల్లందు నియోజకవర్గ కన్వీన ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు 

అనంతరం కేకు కట్ చేసి కేక్ మరియు స్వీట్లు పంపిణీ చేశారు 

ఈ కార్యకమానికి విచెసిన పార్టీ సీనియర్ నాయకులను శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు 

ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ, సర్పంచ్  చాందావత్ రమేష్ బాబు,TNSF పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..

 బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధిని చేయడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న ఎన్ టి రామారావు  తీసుకున్న నిర్ణయమే తెలుగుదేశం పార్టీ అని రెండు రూపాయలకే కిలో బియ్యం,50 రూపాయలకే హార్స్ పవర్,కూడు గుడ్డ నినాదంతో, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేస్తూ మహిళలకు ఆస్తిలో హక్కును కల్పిస్తూ ఇలా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం

బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి రాజకీయంగా ముందుకు నడిపించింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సారి పార్లమెంట్ లో దళితుడిని స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రెవెన్యూ అందిస్తున్న హైదరాబాదును తీర్చిదిద్దింది  తెలుగుదేశం పార్టీ, ఇలా ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ ఫలాలను అందించింది తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకొని వెళ్లిన వారేనని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా  పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎరగని మెజార్టీని ప్రజలు అందించారని 

 రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలమైన శక్తిగా ఎదుగుతుందని వారు ఆశ భావం  వ్యక్తం చేశారు 

 ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మనుబోతుల అఖిల్,సీనియర్ నాయకులు శ్యామ్ తీవరి, కారు నరసన్న,మైపా బాలరాజు, చెలిమల బాబు, నున్నా రామకృష్ణ,కందిరవి,దగ్గుల లింగయ్య,గోగేలా రాజేష్,ముక్కు శ్రీవెద్, దేవరకొండ నవీన్, కామ ప్రణయ్,రాజ్ కుమార్,సన్నీ, వినయ్, తదితరులు పాల్గొన్నారు

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >