Posted on 2026-04-01 19:53:00
వెంకట సాయి నగర్ కాలనీ ప్రజలకు అండగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్
డైలీ భారత్, రామంతాపూర్: వెంకట సాయి నగర్ కాలనీలో కొన్నేళ్లుగా లో వోల్టేజ్ సమస్య కారణంగా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ పటేల్ ముందుకు వచ్చారు.
కాలనీలోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆయన, కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మరియు టీం సభ్యులతో కలిసి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ AE కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా AE కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అరుణ్ పటేల్ మాట్లాడుతూ,
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి మార్గదర్శకత్వం, సహకారంతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
వెంకట సాయి నగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, నవీన్, విద్యాసాగర్, రమేష్, రాజు , రామకృష్ణ , భూపతి నరసింహ, శివకుమార్ , రమేష్ యాదవ్ , లక్ష్మణ్, పరశురాం, ఐలేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >