Posted on 2026-04-02 12:04:26
శుభాకాంక్షలు తెలియజేసిన పెండ్యాల విజయభాస్కర్
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు కోర్టు ఆదేశాలతో సిటీ సివిల్ కోర్టులో ఓట్లను లెక్కించగా అమరవాది లక్ష్మీనారాయణ ఆరు ఓట్లుతో గెలుపొందారు ఈ సందర్భంగా హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెండ్యాల విజయభాస్కర్ అమరవాది లక్ష్మీనారాయణ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గడచిన 12 సంవత్సరాల కాలంలో అమరవాది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఆర్యవైశ్యుల సంక్షేమం కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని పోయి అందరికీ అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు ఆయనకు ఆర్యవైశ్యుల కుల దైవం అమ్మ వాసవి మాత సేవ చేసే శక్తి ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >