Posted on 2026-04-03 08:54:24
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాతల్లాడ మండలంలోని నారాయణపురం రామ భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నారాయణపురంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాలను చేతపట్టుకుని పాదయాత్రగా బయలుదేరి తరలి వెళ్లారు. సుమారు 8 మంది పాదయాత్రగా రాముల వారి గేయాలను ఆలపిస్తూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు పండాలని స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ భక్తులుజీడిమళ్ళ కిషోర్ రెడ్డి, రెడ్ ఎం రామకృష్ణారెడ్డి. రెడ్ యం రామిరెడ్డి.రెడ్డి ఆదినారాయణ .ఎర్రమల నాగార్జున రెడ్డీ.ఎర్రమల సైదిరెడ్డి. జీడిమల్ల కౌశిక్ రెడ్డిఇతర భక్తులు పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >