Posted on 2026-04-03 12:11:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం టౌన్లో సూపర్ బజార్ సమీపంలోని రావి చెట్టు కింద నివసిస్తున్న చర్మకారుల సంఘం పెద్దమనిషి సత్యాల వెంకన్న (రెడ్డి) కన్నుమూశారు. ఆయన మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
26వ డివిజన్కు చెందిన వెంకన్న చర్మకారుల సంఘంలో ప్రముఖ నాయకుడిగా, సామాజిక సేవలో ముందుండి పనిచేశారు. సంఘానికి చేసిన సేవలు గుర్తుండేలా ఉన్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, నాయకులు కూసుపాటి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ తదితరులు వెంకన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రిపోర్టర్ సాంబశివరావు, సారధి ఆధ్వర్యంలో చర్మకారుల సంఘం సభ్యులు కూడా వెంకన్న సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >