Posted on 2026-04-03 08:41:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం టౌన్లో సూపర్ బజార్ సమీపంలోని రావి చెట్టు కింద నివసిస్తున్న చర్మకారుల సంఘం పెద్దమనిషి సత్యాల వెంకన్న (రెడ్డి) కన్నుమూశారు. ఆయన మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
26వ డివిజన్కు చెందిన వెంకన్న చర్మకారుల సంఘంలో ప్రముఖ నాయకుడిగా, సామాజిక సేవలో ముందుండి పనిచేశారు. సంఘానికి చేసిన సేవలు గుర్తుండేలా ఉన్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, నాయకులు కూసుపాటి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ తదితరులు వెంకన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రిపోర్టర్ సాంబశివరావు, సారధి ఆధ్వర్యంలో చర్మకారుల సంఘం సభ్యులు కూడా వెంకన్న సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >