| Daily భారత్
Logo




కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

News

Posted on 2026-04-04 18:12:56

Share: Share


కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఆటలపోటీలలో పాల్గొనడం వల్ల దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని,మరింత ఆరోగ్యవంతులవుతారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన గాయత్రి క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ-2026 ప్రారంభించారు.ఈ పోటీలను ప్రారంభించేందుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక యువకులు బాణసంచా పేల్చి,డప్పు వాయిద్యాలతో ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులకు ఘన స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్,వనమా రాఘవ,కాపు సీతామహాలక్ష్మీ,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ తదితర ప్రముఖులు అమరవీరుల స్థూపానికి పూలుజల్లి నివాళులర్పించారు.ఎంపీ రవిచంద్ర టాస్ వేసి బ్యాటింగ్ చేసి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించారు.ఈ పోటీల నిర్వాహకులు బీ.శ్రీనివాస్,కన్నిలు ఎంపీ రవిచంద్రకు క్రికెట్ టీం సభ్యులను పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రికెట్ లో మన భారత జట్టు అత్యుత్తమ ప్రతిభాపాటవాలు కనబర్చుతున్నదని కొనియాడారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని,ఈ రంగంలో కూడా గొప్పగా ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,రంగనాథ్,బాదావత్ శాంతి నాయక్,కార్పోరేటర్స్ మల్హోత్రా సాగర్,కాలేరు సింధూ తపస్వి,బొమ్మిడి రమాకాంత్,బాదావత్ శ్రీకాంత్,నవతన్,బొమ్మిడి శ్రీకాంత్,అనుదీప్ తదితరులతో పాటు వందలాది మంది యువత పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >