Posted on 2026-04-04 21:16:15
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో కలిసి ఆసుపత్రుల పనితీరు, అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ సేవలపై సమగ్రంగా సమీక్షించారు.
ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి, ఆసుపత్రుల్లో కొనసాగుతున్న నిర్మాణాలు, మరమ్మత్తుల పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి ఆసుపత్రి పరిస్థితిపై సూపరింటెండెంట్ల నుండి వివరాలు తెలుసుకుని, సిబ్బంది కొరత, వైద్యుల లభ్యత వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్ల మరమ్మత్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించి, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసవ సేవలపై సమీక్ష నిర్వహించి అవసరమైన మెరుగుదలలు చేపట్టాలని తెలిపారు.
ఆసుపత్రుల్లో పరిశుభ్రత కోసం తగిన శానిటేషన్ సిబ్బంది ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్త నిల్వలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, సికిల్ సెల్ అనీమియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #Healthcare #Aarogyasri #Telangana
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >