Posted on 2026-04-09 11:43:27
డైలీ భారత్, హైదరాబాద్: కేంద్ర పథకం పేరుతో ఏకంగా ఎమ్మెల్యేనే సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. కేంద్ర ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. రూ.10 లక్షల వరకు లోన్లు వస్తాయని చెప్పి నమ్మించిన ఆ సైబర్ నేరగాడు.. అందుకు అప్లికేషన్ ఫీజు కింద ఏకంగా రూ.లక్ష వసూలు చేశాడు. ఆ వ్యక్తి తీరుపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే.. సైబర్ నేరం జరిగిందని భావించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాధారణ ప్రజలనే కాకుండా చదువుకున్న వారిని, ఉద్యోగాలు చేసే వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజాగా బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బురిడీ కొట్టించిన ఓ సైబర్ కేటుగాడు.. ఏకంగా రూ. లక్ష కాజేశాడు. అది సైబర్ మోసమని గుర్తించిన ఎమ్మెల్యే పల్లా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆదివారం ఉదయం ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అతడు తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్నాడు. తన పేరు అనంతరామిరెడ్డి అని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ పథకం కింద అర్హులైన వారికి రూ.10 లక్షల వరకు లోన్లు వస్తాయని చెప్పి నమ్మించాడు. జనగామ నియోజకవర్గంలో ఒక 40 మంది అర్హుల లిస్ట్ పంపిస్తే.. వారికి వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పాడు.
అయితే అది నిజమని నమ్మిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. అతడు చెప్పింది విన్నారు. ఈ క్రమంలోనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ అంటూ చెప్పాడు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.2,500 చొప్పున మొత్తం 40 మందికి ప్రాసెసింగ్ ఫీజు కింద.. రూ.1 లక్ష చెల్లించాలని ఆ సైబర్ నేరగాడు సూచించాడు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం కింద తన నియోజకవర్గంలోని ప్రజలకు లబ్ధి చేకూరుతుందని భావించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రూ.1 లక్షను ఫోన్ పే ద్వారా ఆ వ్యక్తి అడిగిన నంబర్కు పంపించారు.
ఇక కొద్దిసేపటి తర్వాత డబ్బులు రాలేదని.. మరోసారి పంపించాలని ఆ వ్యక్తి అడగడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుమానం కలిగింది. దీంతో అసలు అతడు నిజమైన ప్రభుత్వ ఉద్యోగేనా అని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ఒక సైబర్ మోసగాడని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. వెంటనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ సైబర్ మోసగాడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >