| Daily భారత్
Logo




ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

News

Posted on 2026-04-10 18:20:34

Share: Share


ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా ప్రణాళిక – ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా, హోమియోపతి & ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా యోగ కేంద్రంలో యోగా తరగతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (DM&HO) అధ్యక్షత వహించగా, RDO Y. V. గిరి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా స్థాయి అధికారులు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రగతి పాలన అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాభివృద్ధి కూడా. ఆయుష్ వైద్యం, యోగా మన సంస్కృతిలో అంతర్భాగం. వీటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఆరోగ్య శాఖపై ఉంది” అని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ వైద్య విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యోగా, ఆయుర్వేదం, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీవనశైలిని మెరుగుపరుస్తాయని,

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మెగా ఆయుష్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు.

ప్రజలందరూ యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో DM&HO  మాట్లాడుతూ, ఆయుష్ వైద్య విధానాల్లో హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్యాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు (NCDs) నివారణలో యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

అనంతరం ఆయుష్ విభాగం యోగా ఇన్‌స్ట్రక్టర్ ఆధ్వర్యంలో 45 నిమిషాలపాటు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో సూక్ష్మ వ్యాయామాలు, తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం వంటి యోగా ఆసనాలు, అనులోమ-విలోమ, భ్రామరీ ప్రాణాయామాలు మరియు ధ్యానం చేయించబడింది.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగా చేయాలని, తమ పరిధిలో ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >