Posted on 2026-04-10 20:49:00
డైలీ భారత్, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ ముఖ్య నాయకుడు బొత్స సత్య నారాయణను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ (బి.వి.ఆర్) కలుసుకున్నారు. శుక్రవారం ఉదయం సిరిపురంలోని బొత్స నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు . ఇటీవల కాలంలో బొత్స ఆరోగ్యం కాస్త మందగించిన నేపథ్యంలో ఈ భేటీ కొనసాగింది. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉందని, ఏది ఏమైనా మంచి ఆరోగ్యంతో ఉండాలని బివిఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో.. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బొత్స సత్యనారాయణకు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తండ్రి దివంగత బి.వి.రామారావుతో కూడా మంచి అనుబంధం ఉండేది. ఇదే విషయాన్ని బొత్స మరోసారి గుర్తు చేసుకున్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >