Posted on 2026-04-10 20:44:45
డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో పీజీ ప్రథమ మరియు తృతీయ సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్ ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తూ, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
ఈ సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. దాదాపు అన్ని విభాగాలలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేశారు
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయి అని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి కళాశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలి" అని సూచించారు.
వైస్ ప్రిన్సిపల్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె . కిష్టయ్య మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణను పాటించడం వల్ల ఫలితాలను సకాలంలో విడుదల చేయగలిగాము అని,అటానమస్ హోదా పొందిన తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, ఫలితాల్లోనూ నాణ్యత పెరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్, కళాశాల పరీక్షా విభాగం అధికారులు ఎన్. రాములు,ఏ.రాజేందర్ పాల్గొన్నారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >