Posted on 2026-04-11 16:26:39
డైలీ భారత్, వైరా: కళ కల కోసం కాదని, ప్రజల కోసమని, ప్రజా కళలు వర్ధిల్లాలని నినాదంతో ఈనెల 15 16 17 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నామాలక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
ప్రజానాట్యమండలి వైరా డివిజన్ ముఖ్యుల సమావేశం చెరుకు మళ్ళీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాదం మతోన్మాద విష సంస్కృతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని భారతదేశం నిజమైన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుటకు ప్రజానాట్యమండలి కృషి చేస్తుందని ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం కై రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలకు పిలుపునిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల పట్ల కళా ప్రజా కలల పట్ల చేస్తున్న నిర్లక్ష్య ధోరణి పై తీర్మానాలను ఆమోదించి ప్రజా కళల అభివృద్ధికి ప్రజా ఉద్యమాలకు సంఘీభావంగా ప్రజలను ఒడగట్టి నూతన సంస్కృతి కోసం కృషి చేస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజానాట్యమండలి నిర్మాణానికి కావలసిన సహకారాన్ని సంఘీభావాన్ని ప్రజలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు, కే నరేంద్ర, రుద్రాక్షల నరసింహ చారి, ఆదిమాళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >