Posted on 2026-04-12 12:10:38
డైలీ భారత్, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సర్వారెడ్డి కాలనీ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం, ఆ గోదాంలో డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచారు. ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ వంటి వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >