Posted on 2026-04-14 14:43:54
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారత రాజ్యాంగ నిర్మాత,మహా మేధావి,సామాజిక న్యాయ సాధకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన టీడీపీ వేములవాడ అడాహాక్ కమిటీ సభ్యులు,టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమానత్వం,న్యాయం,స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని,ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు,రక్షణ,గౌరవాన్ని కల్పించే శాశ్వత దారిదీపంగా నిలిచిందని, “విద్య పొందండి –సంఘటితమవండి –పోరాడండి” అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం అని తెలిపారు.
సమాజంలో సమానత్వం,సోదరభావం,న్యాయం నెలకొల్పడమే అంబేద్కర్ గారి లక్ష్యం అని,ఆ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని మోతె రాజిరెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >