Posted on 2026-04-16 11:11:21
ప్రియుడు, సుపారీ గ్యాంగ్ తో కలిసి పాశవిక హత్య
–పరకాలలో సంచలనం
డైలీ భారత్, హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ (35) ఈనెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
దర్యాప్తులో బయటపడిన విషయాలు షాకింగ్గా మారాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సుమన్ను అతని భార్య లావణ్య అత్యంత పాశవికంగా హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
సుమన్ భార్య లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డంకిగా భావించిన లావణ్య, తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.
ప్రియుడు సహా మరో 8 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను తీసుకొని ఈనెల 4న ములుగు జిల్లా దయ్యాలవాగు సమీపానికి సుమన్ను తీసుకెళ్లి, అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >