| Daily భారత్
Logo




శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

News

Posted on 2026-04-22 20:13:36

Share: Share


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఆలయ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన కాలక్షేప (ఆశీర్వచన) మండపాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. 

అలాగే భక్తుల నివాసార్థం నిర్మించిన గృహాల ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు పలు కాటేజ్ పనులకు శంకుస్థాపన చేశారు.

గత సంవత్సరం శంకుస్థాపన చేసిన పనులకు ఏడాది వ్యవధిలోనే ప్రారంభోత్సవం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఈ సందర్భంగా ఆలయ పాత కమిటీ అధ్యక్షులు మరియు పాలకవర్గ సభ్యుల పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆలయ కమిటీ చైర్మన్‌గా శనిగరం కమలాకర్ రెడ్డి కొనసాగుతుండగా, సభ్యులుగా బండారి యాదగిరి రెడ్డి, గట్టగోని రామ గౌడ్, కొత్త కాపు రాజారెడ్డి, పాత లక్ష్మీరాజ్యం, ఎర్రబోయిన దేవయ్య, కందాడి బాల్ రెడ్డి, కర్రోల్ల శంకర్ గౌడ్, నల్ల అంజయ్య, చింతల నర్సింలు కొనసాగనున్నారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,

చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో మహిమగలదని, స్వామివారి అనుగ్రహంతోనే తనకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కలిగిందని తెలిపారు.

మతభేదాలు లేకుండా భక్తి భావంతో సేవ చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.

మండుతున్న ఎండల్లో కూడా భారీ సంఖ్యలో వచ్చిన భక్తులను స్వాగతిస్తూ, ఆలయానికి రోడ్డు మరియు విద్యుత్ సౌకర్యాలు కల్పించడం తనకు లభించిన భాగ్యమని అన్నారు.

చైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి విశేషంగా జరిగిందని ప్రశంసిస్తూ, అందుకే ఆయనను తిరిగి చైర్మన్‌గా నియమించామని తెలిపారు.

ప్రతి ఆదివారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుందని, కోరికలు కోరిన వారికి స్వామివారు వరప్రదుడిగా నిలుస్తారని అన్నారు.

భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు నర్సింగరావు, రమేష్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసి నాయక్, దేవరాజ్ గౌడ్, సుతారి రమేష్, తిరుమల గౌడ్, బల్యాల సుదర్శన్, ఐరెని నరసయ్య, రాజగౌడ్, గంప ప్రసాద్, గోనే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >