Posted on 2026-04-22 20:10:32
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి: కామారెడ్డి పట్టణం దేవునిపల్లి మధురానగర్ 34వ వార్డులో అంగన్వాడి కేంద్రం సమీపంలో 30 ఫీట్ల ప్రధాన రోడ్డును ఓ వ్యక్తి త్రవ్వేసి నాలుగు ఫీట్ల మేర కబ్జాకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మధురానగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల క్రితం రాజు అనే వ్యక్తి తన ప్లాటు రోడ్డులో పోయిందని ఏకంగా దేవునిపల్లి గ్రామపంచాయతీ కాలం నుంచి ఉన్న ప్రధాన మురికికాల్వలను త్రవ్వేశారు. ఈ విషయమై కౌన్సిలర్ ఆకుల సుజిత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయిన మున్సిపల్ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. రాజు అనే వ్యక్తి బుధవారం రోడ్డు కబ్జా మురికికాలువ నిర్మానం చేపట్టారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి రోడ్డును కాపాడాలని మధురానగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >