Posted on 2026-04-23 11:00:59
రవీంద్రభారతిలో ఈ శుక్రవారం అవార్డు ప్రధానం
రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తింపుగా
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ప్రతిభా రత్న టాలెంట్ అవార్డు 2026 కు ఎంపిక ఇవ్వడం జరిగింది.ఈ అవార్డును హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ కమిటీ ఎంపిక చేయడం జరిగింది.ఈ అవార్డును శుక్రవారం రోజున హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అందుకోవడం జరుగుతుంది.ఈ అవార్డుకు ఎంపిక చేసిన హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ చైర్మన్ కొంపల్లి సత్యనారాయణ,నేషనల్ ఇన్ చార్జ్ బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీల శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటివరకు 350కు పైగా రక్తదాన శిబిరాలను,26 వేల యూనిట్ల పైగా రక్తాన్ని,తల సేమియా బాధిత చిన్నారులకు ఆరు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు.ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >