| Daily భారత్
Logo




కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

News

Posted on 2026-04-25 21:27:36

Share: Share


కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

డైలీ భారత్, ఛత్తీస్‌గఢ్‌: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్‌ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు. అతడి ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ ప్రియురాలైన 25 ఏళ్ల సరోజిని భరద్వాజ్ అతడి ఇంటికి చేరుకున్నది. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. తన కుటుంబం ప్రయాణం కోసం టిక్కెట్లు కొనడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.

కాగా, కానిస్టేబుల్‌ భార్య రీనాతో సరోజిని వాగ్వాదానికి దిగింది. గొడవ బయటకు వినిపించకుండా టీవీ సౌండ్‌ పెంచింది. ఆ తర్వాత రీనా, ఆమె ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. రీనాతో పాటు నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల ఆదిత్యను పదేపదే కత్తితో పొడిచింది.

అయితే కుమార్తెలు నైనా, తానియాపై సరోజిని కత్తితో దాడి చేస్తుండగా రీనా ప్రతిఘటించింది. ఆమె కాళ్లు పట్టుకుని తన పిల్లలను వదిలిపెట్టమని వేడుకున్నది. కుమార్తెలను పారిపోమని చెప్పింది. దీంతో ఒక కుమార్తె బాత్‌రూమ్‌లో దాక్కోగా, మరో కుమార్తె తప్పించుకుని బయటకు పరుగెత్తింది. పొరుగువారిని అప్రమత్తం చేసింది.

మరోవైపు పొరుగువారు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తపు మరకలున్న కత్తితో తలుపు దగ్గర ఉన్న సరోజినిని చుట్టుముట్టి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను అప్పగించారు. రీనా, ఆమె పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెతో పాటు కుమారుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది.

కాగా, కానిస్టేబుల్‌ లలితేష్‌, సరోజిని మధ్య ఉన్న సంబంధం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. శుక్రవారం కూడా ఆమె అతడి ఇంటికి రాగా నచ్చజెప్పి పంపించినట్లు తెలిసిందన్నారు. శనివారం లలితేష్ ఇంట్లో లేని సమయంలో వచ్చిన సరోజిని అక్కడ రక్తపాతం సృష్టించిందని చెప్పారు. నిందితురాలిని అరెస్ట్‌ చేసి ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >