| Daily భారత్
Logo




“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

News

Posted on 2026-04-26 11:49:35

Share: Share


“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ లో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, శివాని హాస్పిటల్స్, సిరిసిల్ల వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. 

ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కార్తికేయన్ యం.డి. పల్మనాలజిస్ట్, డాక్టర్ శివరామకృష్ణ డెంటల్ వైద్య నిపుణులు, కె.పున్నంచందర్, సైకాలజిస్ట్ వైద్య సేవలు అందించారు.

ఈ శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని, ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఛాతి, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు డాక్టర్ కార్తికేయన్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పొగతాగడం, అనారోగ్యకర అలవాట్ల వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని తెలిపారు.

దంత వైద్య నిపుణులు డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ దంత ఆరోగ్యం కూడా శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పిల్లలలోనూ పెద్దలలోనూ దంత సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రముఖ సైకాలజిస్ట్ కె . పున్నంచందర్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, కుటుంబ సమస్యలు, వ్యసనాల కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో కౌన్సెలింగ్ మరియు మానసిక ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ అవసరమని పేర్కొన్నారు.

శిబిరంలో ప్రజలకు రక్తపోటు, షుగర్, శ్వాసకోశ సమస్యలు, దంత సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య నిపుణులు ప్రజలకు ఆరోగ్య సలహాలు అందించి, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

వార్డు కౌన్సిలర్ మామిడాల మహేశ్ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య పరిరక్షణపై మరింత శ్రద్ధ చూపాలని కోరారు.

కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, సైకాలజిస్ట్ పున్నంచందర్, వార్డు కౌన్సిలర్ మామిడాల మహేశ్, ఏలగొండ ఆంజనేయులు, అంతడ్పుల రాము, శ్రీనివాస్, గద్దె ప్రకాశ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు శిబిరాన్ని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరారు.


Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >