Posted on 2026-05-05 16:56:42
డైలీ భారత్, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం కలిపి.. ఆపై దిండుతో అదిమి కిరణ్ కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ హత్య కేసు మిస్టరీ వీడింది. భర్త కిరణ్ కుమార్.. పద్మజను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్, ముద్దనూరుకు చెందిన పద్మజకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ఏడేళ్ల పాప కూడా ఉంది. అయితే కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. భార్య భర్తల మధ్యన మనస్పర్థలు తలెత్తాయి. దీనికి తోడు తన భార్య లావుగా ఉందని.. ఎక్కువగా తింటోందని కిరణ్ కుమార్ భావిస్తూ వచ్చాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు
భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న కిరణ్.. అందుకు పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ముందుగా విషం పెట్టి భార్యను హత్య చేయటం ఎలా అనే దానిపై యూట్యూబ్లో శోధించాడు. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి హైదరాబాద్ నుంచి విషం తెప్పించుకున్నాడు. ఈ విషాన్ని పాలకోవాలో కలిపిన కిరణ్ కుమార్.. భార్య పద్మజకు తినిపించాడు. భార్య అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత.. ఇంకా చనిపోలేదని, దిండుతో అదిమి హత్య చేసినట్లు ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడైన కిరణ్కు వివాహేతర సంబంధం కూడా ఉందని ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు. ఏడాది కిందట హైదరాబాద్లో ఉన్న సమయంలో వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందని.. అయితే పద్మజ హత్యకు, ఆ మహిళకు సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకూ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
చంపాలని నిర్ణయించుకుని.. ప్రేమగా ఇంటికి తెచ్చి, పాలకోవాలో విషం పెట్టి..
భార్యభర్తల మధ్య విభేదాలు రావటంతో గత కొంతకాలంగా పద్మజ తల్లివద్ద ఉంటోంది. అయితే భార్యను చంపాలని నిర్ణయించుకున్న కిరణ్.. ఆమెను పుట్టింటి నుంచి తన ఇంటికి తెచ్చాడు. ప్రేమగా నచ్చజెప్పి ఆమెను ఒప్పించి ఇంటికి తెచ్చిన కిరణ్.. మూడు రోజులు ఆమెతో బాగానే ఉన్నాడు. ఏప్రిల్ 29వ తేదీ హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా తెచ్చిన విషాన్ని పాలకోవాలో కలిపి.. ఆమెకు తినిపించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పద్మ తల్లిదండ్రులకు ఆమె చనిపోయిందని సమాచారం అందించాడు
అయితే కిరణ్ మీద అనుమానంతో పద్మజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి పద్మజ పోస్టుమార్టం నివేదికలో కొన్ని అనుమానాలు వ్యక్తం కావటంతో.. పోలీసులు కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో కిరణ్ నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >