| Daily భారత్
Logo




మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

News

Posted on 2026-05-05 18:58:50

Share: Share


 మొక్కజొన్నలు  పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో గోడు వెళ్లబోసుకున్న కేషన్నపల్లి రైతులు

కేసీఆర్ పుణ్యానా సాగునీళ్లు వచ్చి ఏడాదికి మూడు పంటలు తీస్తున్నాం

మొక్కజొన్నలు ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాల్లే కొనడంతో మిగతావి దళారులకు అడ్డికి పావుసేరు అమ్ముకుంటున్నామని ఆవేదన

కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు మొక్కజొన్నలు కొనాలని రసమయి బాలకిషన్

ప్రభుత్వం పూటకో మాట చెప్పుతూ రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపాటు

డైలీ భారత్, ఇల్లంతకుంట: మా  నల్లరేగడి భూముల్లో చినుకు చుక్క పడితేనే పత్తి సాగు చేసుకునేటోళ్లం...కానీ గత ఐదారేళ్ల సంది కేసీఆర్ పుణ్యమా అని అనంతగిరి డ్యాం కట్టి కాల్వలు నిర్మాణం చేసి సాగు నీళ్లు ఇవ్వడంతో వర్షాకాలంలో పత్తి... యాసంగిలో  పొద్దుతిరుగుడు,మొక్కజొన్న సాగు చేస్తూ ఏడాదికి మూడు  పంటలు పండిస్తున్నామని పేర్కొన్నారు

ఇల్లంతకుంట మండలంలోని కేషన్నపల్లి గ్రామ రైతులు మానకొండూర్ మాజీ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ తో అన్నారు.

ఇల్లంతకుంట నుంచి బెజ్జంకి వైపు వెళ్తున్న క్రమంలో కేషన్నపల్లి వద్ద మొక్కజొన్న కంకులు ఏరుతున్న రైతులను చూసి వాహనం నిలిపి  రైతు ప్రభాకర్ వ్యవసాయక్షేత్రంలోకి వెళ్లి పలకరించారు.

ఈ సందర్భంగా రైతులు రసమయి బాలకిషన్ తో ఇలా గోడు వెళ్లబోసుకున్నారు... సారూ మొక్కనోన్నలు పండించి ..అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతావి దళారులకు అడ్డికి పావుసేరు అమ్ముకుని నష్టపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదని రైతులను పీక్కుతినే ప్రభుత్వమని ప్రభుత్వం బేశారతుగా ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నలు కొనుగోలు  చేయాలని డిమాండ్ చేశారు రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే సర్కారు పూటకో నిబంధన పెడుతూ రైతులను నట్టేట ముంచుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని... రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారని పేర్కొన్నారు.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >