Posted on 2026-05-11 20:42:59
డైలీ భారత్, సిరిసిల్ల: మతసామరస్యాన్ని కాపాడుతూ, ఇతరుల మనోభావాలకు కించపరచకుండా పండుగల నిర్వహణ చేపట్టాలని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని,అపోహలు, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న పోలీసు శాఖకు తెలియజేయాలని తెలిపారు. సొంతంగా వాహనాలను ఆపడం తనిఖీలు చేయడం లాంటివి వద్దని తెలిపారు.సోషల్ మీడియా పోస్టులు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 ద్వారా లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >