| Daily భారత్
Logo




ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ

News

Posted on 2026-05-14 18:52:34

Share: Share


ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ

సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు

డైలీ భారత్, కామారెడ్డి: ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీ బాడీ మీటింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగింది. గ్రామ నిధుల వినియోగంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ వార్డు సభ్యులు తగిరంచ రమాదేవి, దేవోల్ల ప్రత్యూష, జ్యోతి,  వెంకట్ స్వామి గౌడ్, నర్సింలు, సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించారు.

బాడీ తీర్మానం లేకుండా, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా భారీ మొత్తంలో బిల్లులు తీసుకున్నారాని వార్డు సభ్యులు ఆరోపించారు. ముఖ్యంగా కేవలం నాలుగు నెలల్లోనే ₹11 లక్షల వరకు బిల్లులు తీసుకున్నారాని, కానీ పాత పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ చేయలేదని మండిపడ్డారు.

సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ వార్డు సభ్యులకు చెప్పకుండా, తీర్మానం లేకుండా డబ్బులు ఎలా తీశావని మరియు నీ సొంత నిర్ణయాలు, వ్యవహారాలు చూసి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని డిమాండ్ చేశారు. అయితే సర్పంచ్ జీడిపల్లి నర్సింహ రెడ్డి మరియు ఉపసర్పంచ్ నుండి సరైన సమాధానాలు రాకపోవడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

● 2026లో తీసుకున్న బిల్లులకు  2023, 2024 జియో - ట్యాగ్ ఫొటోలు ఎందుకు ఉన్నాయి? పాత పనులను కొత్త పనులుగా చూపించారా? అంటూ సభ్యులు నిలదీశారు.

● మేము పాత బకాయిలు చెల్లించాలని కోరినప్పుడు, సర్పంచ్ గారు "నేను 30 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాను… అందరికీ ఇస్తూ పోతే నాకు ఏమి మిగులుతుంది" అని మాట్లాడటం మాకు తీవ్ర బాధ కలిగించింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా, పంచాయతీ కార్యాలయానికి వెళ్లినప్పుడు వార్డు సభ్యుల ఫోన్లు తీసుకుని పక్కన పెట్టిన, తర్వాత మాట్లాడండి అని చెప్పడం ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా ఉందని ఆరోపించారు.

● పాత బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు

● కానీ ఎంపిక చేసుకుని కొంతమందికి మాత్రమే బిల్లులు క్లియర్ చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు.

ఈ సందర్భంగా సభ్యులు మీడియాతో మాట్లాడుతూ:

గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు. కానీ ఇప్పుడు గ్రామంలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలు చూసి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. గ్రామ ప్రజల డబ్బుపై సృష్టత లేకపోవడం చాలా బాధాకరం. గ్రామంలో జరుగుతున్న కొన్ని నిర్ణయాలు చూసి మేమే ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని భావోద్వేగానికి గురయ్యారు.

సర్పంచ్ నర్సింహారెడ్డి గతంలో BRS పార్టీలో వైస్ ఎంపీపీగా, ఇంచార్జ్ ఎంపీపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు గ్రామ ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోందని పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ  వార్డు సభ్యులను పట్టించుకోకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని మండిపడ్డారు.

 అవసరమైతే తదుపరి రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటామని వార్డు సభ్యులు హెచ్చరించారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >