Posted on 2026-05-28 11:02:35
బక్రీద్ వేళ సిరిసిల్లలో ముస్లింల వినూత్న డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్లలోని ఈద్గాలో శాంతియుత వాతావరణంలో ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం వారు ప్లకార్డులతో ఈ డిమాండ్ ను వినిపించారు. దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. జాతీయ పక్షిగా నెమలికి ఉన్న గౌరవం మరియు హోదా ఆవుకు కూడా కల్పించాలని, ఆవును జాతీయ జంతువుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని వారు కోరారు. మత సామరస్యానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >