Posted on 2026-05-29 12:17:49
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్ను సందర్శించి ధాన్యం దిగుబడి తీరును పరిశీలించారు. మిల్లుకు చేరుతున్న ధాన్యం నాణ్యత, తూకం ప్రక్రియ, నిల్వ విధానం, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిపై ఆరా తీశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అన్లోడింగ్ చేసి మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ధాన్యం దిగుబడి శాతం, రికవరీ వివరాలు, సీఎంఆర్ లక్ష్యాల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా అందజేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, రైస్ మిల్లర్లు,సంబంధిత అధికారులు, మిల్ యాజమాన్యం పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >