Posted on 2026-06-04 19:02:54
డైలీ భారత్, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఖైతలాపూర్లోని డబుల్ బెడ్ రూమ్స్ ప్రాంతంలో ఓ భర్త తన భార్యను దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. వివరాళ్లోకేళితే.. రహీమ్, సుమేరా దంపతులకు 2024లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. వృత్తిరీత్యా రహీమ్ ఆటో డ్రైవర్. రహీమ్కు, అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున కూడా దంపతులిరువురి మధ్య గొడవ జరిగింది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన రహీమ్.. భార్య సుమేరా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపైన కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >