Posted on 2026-06-23 21:07:27
తాడువాయిలో పెట్రోల్ బాటిల్ తో వచ్చిన నాయకులు
డైలీ భారత్, తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన ధర్నాకు బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు పెట్రోల్ బాటిళ్ల తో రావడంతో తీవ్ర కలకలం రేగింది. తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు పెట్రోల్ బాటిళ్లు తీసుకొని పాత బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ఇద్దరు పెట్రోల్ బాటిల్ మూతలు విప్పి పోసుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారి ప్రయత్నాన్ని కి అడ్డుకట్ట వేశారు. బాటిళ్లు లాక్కొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి సదాశివ నగర్ సిఐ సంతోష్ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నీవు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకో, రాజకీయ నాయకుడి లా వ్యవహరిస్తున్నావు, నీ సంగతి చూస్తా అంటూ వాగ్వాదానికి దిగారు.వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >