Posted on 2026-07-05 11:44:43
డైలీ భారత్,ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. చేబ్రోలు స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, యువకుడు ఉన్నారు. చర్లపల్లి-షాలిమార్ స్పెషల్ ట్రైన్ ఢీకొనడంతో వీరంతా అక్కడికక్కడే మరణించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
ఈ నలుగురూ ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రశీదు, ధ్వంసమైన రెండు సెల్ఫోన్లు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >