Posted on 2026-07-12 16:48:16
డైలీ భారత్ కామారెడ్డి: ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.44 లక్షల వ్యయంతో నూతన పోలీసు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు తదితరులు కలిసి ఈ భవనాలను ప్రారంభించారు.
ప్రారంభించిన భవనాలు:
-బాన్సువాడ రూరల్ సర్కిల్ కార్యాలయం
ట్రాఫిక్ పోలీస్ అవుట్పోస్ట్
ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ హెల్త్ అవుట్పోస్ట్
-సదరం క్యాంప్
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, "దేశ, రాష్ట్ర, ప్రాంత అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకం. రక్షణ ఉన్న చోటే పెట్టుబడులు, సంక్షేమం వస్తాయి. జిల్లా ఎస్పీ చర్యలతో కామారెడ్డి, బాన్సువాడలో శాంతియుత వాతావరణం నెలకొంది" అని అన్నారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, "పోలీసు వ్యవస్థ ప్రజలకు ఎల్లప్పుడూ భరోసాగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ భవనాలు నిర్మించాం. ప్రజలు నిర్భయంగా వచ్చి సమస్యలు చెప్పుకునేలా వాతావరణం కల్పించడమే ఉద్దేశం" అని తెలిపారు.
2024-2025లో రోడ్డు భద్రత చర్యలతో సుమారు 50 మంది ప్రాణాలు కాపాడినట్లు ఎస్పీ వెల్లడించారు. "Arrive Alive" కార్యక్రమం ద్వారా అవగాహన, కఠిన అమలుతో ప్రమాదాలు తగ్గిస్తామని చెప్పారు.
చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ, ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బాన్సువాడ టౌన్ ఎస్హెచ్ఓ శ్రీధర్, ఇన్స్పెక్టర్లు రవికుమార్ తదితరులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >