Posted on 2026-07-12 17:19:03
డైలీ భారత్, సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ శక్తి అభియాన్ – JSJB 3.0 లో భాగంగా "క్యాచ్ ది రైన్" నెలరోజుల ప్రత్యేక ప్రచారం 06.07.2026 నుండి 05.08.2026 వరకు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నేడు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి వేణు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం, నీటి పొదుపు ప్రాముఖ్యత గురించి అధికారులు వివరించారు. ప్రతి ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమం ముగింపులో నీటి వనరులను కాపాడతామని, వర్షపు నీటి సంరక్షణను అమలు చేస్తామని అందరూ జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు.
మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, "నీరు లేకుంటే భవిష్యత్తు లేదు. ప్రతి ఒక్కరూ "క్యాచ్ ది రైన్" లో భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.
#CatchTheRain #JalShaktiAbhiyan #Sircilla
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >