| Daily భారత్
Logo




నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

News

Posted on 2026-07-31 14:26:32

Share: Share


నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను,గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి ఎస్సై గోపి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సింగరేణి సర్కల్ ఇన్స్పెక్టర్ సాగర్ తెలిపారు.  ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం... నిందితులు రాగితో ఆభరణాలను తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారంలా కనిపించేలా తయారు చేసేవారని, అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడంతో పాటు, ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలిందన్నారు. 

ఇదే క్రమంలో రాంచందర్ యొక్క ఏజెంట్ అయిన సునీల్ తో ఇల్లందు ముత్తుట్ ఫైనాన్స్ లో 52 గ్రాముల బంగారం పెట్టించి 3.90 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. దానిని రిలీజ్ చేయించడానికి ప్లాన్ చేసి హైదరాబాద్ లోని "మన గోల్డ్ కంపెనీ ని సంప్రదించి వారియొక్క ప్రతినిధి ద్వారా 5.80 లక్షలు సునీల్ తీసుకొని మోసం చేసి పారిపోయారని వివరించారు. అట్టి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను కారేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.

ఈ కేసులో అరెస్టయిన నిందితుడి నుండి నేరం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన తెలుపు రంగు వేర్నా కారు (రిజిస్ట్రేషన్ నం. TS04BA2616), రూ.15,000 నగదు, అలాగే నేరాలకు ఉపయోగించిన IQ కంపెనీ మొబైల్ ఫోన్ ను కారేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 

అరెస్టు అయిన నిందితులు:

1)గుగులోత్ సునీల్ కుమార్, R/o. భాగ్యనగర్, కారేపల్లి. 2)ముందాడా రాంచందర్, R/o. కారేపల్లి.

పరారీలో ఉన్న నిందితుడు దారవత్ రాకేష్,  R/o. సూర్యతండా, కారేపల్లి.

ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని  తెలిపారు. ఈ కేసులో విచారణ అధికారి కారేపల్లి ఎస్సై గోపి, సహకరించిన కామేపల్లి ఎస్సై శ్రీకాంత్ ను అభినందిచారు.

ప్రజలకు విజ్ఞప్తి:

బంగారం తాకట్టు పెట్టే ముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత ఆభరణాల స్వచ్ఛతను తప్పనిసరిగా పరీక్షించుకోవాలని, అనుమానాస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని, అదేవిదంగా ఎవరైనా బాధితులు ఉంటే సంప్రదించగలరని సిఐ ప్రజలను కోరారు.

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >