Posted on 2026-08-04 13:06:14
డైలీ భారత్, విజయవాడ: తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని, మన సంప్రదాయాల వైభవాన్ని తన అద్భుతమైన కవితా శిల్పంతో సజీవంగా ఆవిష్కరిస్తున్న కవయిత్రి మంజుల పత్తిపాటి కి "మిత్ర రత్నావళి" బిరుదు ప్రదానం చేశారు.
స్నేహం అనే పవిత్ర బంధానికి ప్రతీకగా జులై 30న జరుపుకున్న స్నేహితుల దినోత్సవం సందర్భంగా, తెలుగు భాష-సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే స్ఫూర్తిదాయకమైన కవిత్వాన్ని రచించినందుకు ఆమె సాహిత్య ప్రతిభను, సాంస్కృతిక నిబద్ధతను గుర్తిస్తూ ఈ బిరుదును అందజేశారు.
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2న విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ సత్కారం ఘనంగా నిర్వహించారు.
సాహిత్యరంగంలో విశిష్టమైన సేవలను అందిస్తూ, పాఠక హృదయాలను అలరిస్తున్న మంజుల పత్తిపాటి కి ఈ గౌరవం దక్కడం పట్ల సాహితీ ప్రముఖులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
కవయిత్రి మంజుల పత్తిపాటికి "మిత్ర రత్నావళి" బిరుదు. తెలుగు భాషా సేవకు విజయవాడలో ఘన సత్కారం.
#మంజులపత్తిపాటి #మిత్రరత్నావళి #తెలుగుసాహిత్యం #విజయవాడ #స్నేహదినోత్సవం
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >