Posted on 2024-02-29 11:03:42
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకోసం ‘వన్ టైమ్ స్కీమ్’ (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఓటిఎస్ కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది.
2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్ టైం స్కీం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2023 మార్చి నాటికి ఆస్తి పన్ను, వడ్డీ, జరిమానాలు చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వారు చెల్లించిన 90% వడ్డీ మొత్తాన్ని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) ఆర్డర్ ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం సర్దుబాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
మొత్తం బకాయిలు + బకాయిల వడ్డీ : రూ. 9,803.39 కోట్లు
OTS (2022-23)కి అర్హత కలిగిన అసెస్మెంట్ల సంఖ్య : 5,25,709
ఆస్తి పన్ను వసూళ్లు (లక్ష్యం 2023-24 కోట్లు) : 2,10 కోట్లు (జనవరి 2024 వరకు) : 1,268.49 కోట్లు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >