Posted on 2023-11-08 18:25:06
కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్.
2,30,000/- రూపాయలు, బైక్ స్వాధీనం.
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : దొంగతనం కేసును సిరిసిల్ల పోలీసులు రెండు గంటల్లోనే చేదించారు. కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్ చేసి, వారి వద్ద 2,30,000/- రూపాయలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈమేరకు బుదవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కి చెందిన సిలుముల రాజనర్సు అనే వ్యక్తి మంగళవారం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో తన పెన్షన్ డబ్బులు 2,30,000/- రూపాయలు వేయడానికి నడుచుకుంటూ నటరాజ్ థియేటర్ దారిగుండ వెళ్ళే క్రమంలో పట్టణంలోని సుభాష్ నగర్ కవ్వంపెళ్ళి హరీష్, శాప అరవింధ్ ఇద్దరు బైక్ మీద వచ్చి, బండి వెనకాల కూర్చున్న ఒకరు బండి దిగి రాజనర్సు కొట్టి డబ్బులను లాక్కొని బండిపై పారిపోయినారని సిలుముల శంకర్ నారయణ ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే స్పందించిన సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ బి.ఉపేందర్ తన క్రైమ్ టీమ్ సిబ్బంది, సిసిఎస్ సిఐ రవీందర్, సిబ్బందితో కలిసి రెండు గంటల వ్యవదిలోనే సిరిసిల్లాలోని సుభాష్ నగర్ వాటర్ టాంక్ వద్ద పట్టుకొని, నిందితుల నుండి దొంగిలించిన 2,30,000/- రూపాయలు, మోటార్ సైకల్ ని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ చెప్పారు. దొంగతనం కేసులో చాకచక్యంగా వ్యవహరించి రెండు గంటల్లో నిధుతులను పట్టుకున్న టౌన్ సిఐ ఉపేందర్, టాస్క్ఫోర్స్ సిఐ రవీందర్, సిబ్బంది పుల్కమ్ శ్రీనివాస్, శ్రీకాంత్, ఆక్సర్, తిరుపతి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సిఐ ఉపేందర్, సిబ్బంది శ్రీనివాస్, శ్రీకాంత్, గోపాల్, నాగరాజు ఉన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >