Posted on 2024-09-11 17:56:52
నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమర్జనానికి అన్ని ఏర్పాట్లు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద నిమర్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ బచ్చలి నర్సింహా, నాయకులు చెట్ల నర్సింహా, శేఖర్, శ్రీశైలం, రవి, అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమర్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని వివరించారు. గణేష్ నిమర్జనం కార్యక్రమంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, నిమర్జనం కార్యక్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >