Posted on 2024-09-12 14:17:57
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్ డెస్క్: రీల్స్ పిచ్చి ఓ కుంటుంబాన్ని బలితీసుకుంది. సోషల్ మీడియాను అడ్డదారిలో వాడిన ఓ బాలుడు తాను దుర్మరణం చెందడంతోపాటు తల్లిదండ్రుల చావులకు ప్రత్యక్షంగా కారణమయ్యాడు.
ఏకంగా రైలు వస్తున్నపుడు పట్టాలపై నిలబడి వీడియో తీసి నెట్టింట సంచలనం క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో అదే రైలు కిందపడి నలిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
శుభకార్యానిక హాజరై..
యూపీలోని సీతాపూర్ జిల్లా లహర్పూర్కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24)లకు అబ్దుల్లా అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే బుధవారం లఖింపూర్ ఖిరి జిల్లా హర్గావ్ దగ్గరలోని క్యోతి అనే గ్రామంలో ఓ శుభకార్యానికి కుటుంబంతో హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చి ఫొటోలు దిగడం మొదలుపెట్టారు. అప్పటికే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అలవాటున్న వారు.. రైల్వే ట్రాక్ పైకి వచ్చి రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైలు వస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ముగ్గురిని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని విచారించారు. ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >