Posted on 2024-09-12 14:17:57
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్ డెస్క్: రీల్స్ పిచ్చి ఓ కుంటుంబాన్ని బలితీసుకుంది. సోషల్ మీడియాను అడ్డదారిలో వాడిన ఓ బాలుడు తాను దుర్మరణం చెందడంతోపాటు తల్లిదండ్రుల చావులకు ప్రత్యక్షంగా కారణమయ్యాడు.
ఏకంగా రైలు వస్తున్నపుడు పట్టాలపై నిలబడి వీడియో తీసి నెట్టింట సంచలనం క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో అదే రైలు కిందపడి నలిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
శుభకార్యానిక హాజరై..
యూపీలోని సీతాపూర్ జిల్లా లహర్పూర్కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24)లకు అబ్దుల్లా అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే బుధవారం లఖింపూర్ ఖిరి జిల్లా హర్గావ్ దగ్గరలోని క్యోతి అనే గ్రామంలో ఓ శుభకార్యానికి కుటుంబంతో హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చి ఫొటోలు దిగడం మొదలుపెట్టారు. అప్పటికే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అలవాటున్న వారు.. రైల్వే ట్రాక్ పైకి వచ్చి రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైలు వస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ముగ్గురిని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని విచారించారు. ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >