Posted on 2024-09-13 09:55:14
డైలీ భారత్, పశ్చిమబెంగాల్: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల కోసం తన పదవిని వదులుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూని యర్ వైద్యురాలిపై అత్యా చారాం, హత్య విషయం న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు దీదీ తెలిపారు.
ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై ప్రతిష్టంభన తొలగించేం దుకు జూనియర్ వైద్యుల తో తాను చర్చలు జరిపేం దుకు మూడుసార్లు ప్రయ త్నించానని తెలిపారు. వైద్యుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లు తెలిపారు.
7లక్షల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని మమతా బెనర్జీ తెలిపారు. ఆర్జీకర్ ప్రతిష్టం భన నేటితో ముగింపు లభిస్తుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెప్పారు.
కాగా ప్రస్తుతం ఈ కేసు ఈ కోర్టు పరిధిలో ఉంది. అందుకే జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేసినట్లు చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయలేము. అయితే ఈ భేటీ వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశాము.
సుప్రీం అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అంది స్తాం. ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులపై ఎలాంటి చర్యలు తీసు కోను..పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను అంటూ సీఎం మమతా తెలిపారు.
ఇక ముఖ్యమంత్రితో జూనియర్ వైద్యుల చర్చల నేపథ్యంలో నాటకీ పరిణా మాలు ఎదురయ్యాయి. సీఎంతో భేటీని లైవ్ లో టెలికాస్ట్ చేయాలని జూనియర్ వైద్యులు పట్టుబట్టారు.
అలాగే 30 మంది వైద్యుల బ్రుందాన్ని చర్యలకు అను మతించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం 15మందికే అను మతి ఉందని చెప్పడంతో దానికి ఒప్పుకోని వైద్యులు తాము 30 మంది వెళ్తామ ని ప్రకటించారు.
దీంతో చర్చలపై ప్రతిష్టం భన నెలకొంది. మరోవైపు వైద్యులతో భేటీ అయ్యేం దుకు తాను దాదాపు 2 గంటలు వేచి చూసానని మమత తెలిపారు. ఈ నేపథ్యంలో డీజీపీ రాజీవ్ కుమార్, ఎడీజీ సుప్రతిమ్ సర్కార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ వైద్యుల బ్రుందంతో చర్చలు జరిపారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >