Posted on 2024-09-14 16:56:17
డైలీ భారత్, హైదరాబాద్: పదేళ్లలో ఈ రకమైన దాడులు ఎప్పుడు జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్లో శాంతిభ ద్రతలు కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఎమ్మెల్యే ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. దాడి ఘటన వివరా లను అడిగి తెలుసుకు న్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధా నం చెప్పలేకే దాడులు చేస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడా రని ప్రశ్నించారు. పార్టీ మారిన వారు దమ్ముం టే రాజీనామా చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీ లను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు హైడ్రా పేరుతో హైడ్రామ చేస్తూ, ఎమ్మెల్యేల ఇంటికే గూండా లను పంపిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాంతీయ బేధాలు ఎప్పుడూ కనిపించలేద న్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంలోనే ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే విధంగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నా రని ఘాటుగా విమర్శిం చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచినట్లు చెప్పారు.
అందుకే హైదరాబాద్ ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపించార న్నారు. తమను గెలిపించ లేదనే కక్షతోనే సీఎం రేవంత్ హైదరాబాద్ ప్రజలపై కక్షకట్టారని అన్నారు కేటీఆర్.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >