Posted on 2024-09-14 19:28:34
జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాల ఏర్పాటు
గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజా ఐపిఎస్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలియజేసారు.ఈ రోజు నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించారు.నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు.జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు.నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు,బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు.ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు.చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో మొత్తం 1537 విగ్రహాలతో పాటు,రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో భద్రాచలానికి నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఇలాంటి సౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాదామైనదని తెలియజేసారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >