Posted on 2023-11-11 10:29:04
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్రనగర్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్లోని సన్సిటీలోని ఓ బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రంగా మారింది.
అయితే ప్రాణనష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే పటాకుల షాపు పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్, పాన్ షాప్, టీ షాపులో మంటలు చెలరేగాయి. ఇవి పూర్తిగా కాలిపోయాయి. అర్థరాత్రి 12 గంటల వరకు క్రాకర్స్ ప్యాక్ చేసి పడుకున్న తరువాత..
రాత్రి 3 గంటల సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటల వేడి, పొగలు రావడంతో షాపులో ఉన్న వ్యక్తులు మేల్కొని తప్పించుకున్నారు.
అయితే ఈ పటాకుల దుకాణాన్ని టెంట్ హౌస్ గోదాములోని రేకు షెడ్డులో ఏర్పాటు చేశారు. దీంతో టెంట్ హౌస్కు చెందిన గోదాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
అయితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది...
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >