Posted on 2024-12-27 13:32:10
డైలీ భారత్, వరంగల్:ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తులతో పాటు రౌడీషీటర్లను ఉక్కుపాదంతో అణిచివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షాలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ శుక్రవారం కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపిలు,అదనపు డిసిపి, ఎసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్, డివిజినల్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్షీట్కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రొడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసంఏవిధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు. ఈ సమావేశంలో నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకొవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు, అధికారులకు పొలీస్ కమిషనర్ పలుసూచనలు చేస్తూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొవాల్సి వుంటుందని మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, నిజాయితీగా పనిచేయాలని, సివిల్ పంచాయితీలకు దూరంగా వుండాలని, తప్పుడు కేసు నమోదు చేయవద్దని, పోలీసులు అప్రమత్తంగా లేకుంటే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని ప్రధానంగా ముందస్తు సమాచారంతో పాటు, రౌడీ షీటర్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమచారం సేకరించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిసిపిలు రాజమహేంద్రనాయక్, రవీందర్, ఏఎస్పి మనాన్ భట్, అదనపు డిసిపి రవితో పాటు ఎసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >