Posted on 2024-12-28 16:56:39
రూ.15 లక్షల డ్యూటీ ఫ్రీ లిక్కర్ సీజ్
మూడు కార్లు స్వాధీనం
ఐదుగురిపై కేసు నమోదు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అక్రమ లిక్కర్ దందా చేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు తోపాటు మరో ఇద్దరిని డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఔట్ పోస్టులో జేమ్యా నాయక్ కానిస్టేబుల్గా, బండారి లింగయ్య హోంగార్డుగా పని చేస్తున్నారు. ప్రయా ణికుల నుంచి వీరు టికెట్లను తీసుకుని ఎయిర్
పోర్టులో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొనేవారు.
ఆ తర్వాత వీటిని బయటకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ము కునేవారు.పక్కా సమాచారంతో వీరిద్దరితోపాటు వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు హరీశ్ కుమార్, రాఘవేందర్ను శుక్రవారం పక్కా సమాచారం తో అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ తెలిపారు.
నిందితుల నుంచి రూ.15 లక్షల విలువ చేసే 46 డ్యూటీ ఫ్రీ మద్యం బాటిళ్లతోపాటు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహేందర్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >