Posted on 2025-04-27 22:11:43
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఉనికి కోసం అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుద ముట్టించాలని, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని షాద్ నగర్ నియోకవర్గం బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవరాజుల వెంకటేశ్వర్ రావు.ఆదివారం షాద్ నగర్ నియోకవర్గం బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను హతమార్చారని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. కాశ్మీర్లో పర్యాటకుల మీద కక్షపూరితంగా ఉగ్రవాదులు దాడులు చేయడం దారుణమైన విషయమన్నారు. ఉగ్రవాదులు పిరికిపంద చర్యలను దేశ పౌరులు ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. అమాయకుల మీద చేసిన దాడి చాలా బాధాకరమని భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాడుల పట్ల స్పందించవలసిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద దాడి హేయం అన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.ఈ దాడి ప్రతి పౌరుడినీ కన్నీరు పెట్టించిందన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు .
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >