Posted on 2025-05-11 13:05:41
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల "బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్ – 2025" ను ఈరోజు హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి మరియు మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా అందుకున్నారు. మానసిక ఆరోగ్యంపై అంకితభావంతో పని చేస్తూ, అనేక మంది వ్యక్తులకు జీవిత మార్గదర్శకత్వం మరియు ఆత్మహత్యల నివారణకు కృషి చేసినందుకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.
ఈ అవార్డు ప్రముఖ సంస్థ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ వారు వార్షికంగా దేశవ్యాప్తంగా విశిష్ట సేవలందించిన మానసిక నిపుణులకు అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారం అని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొతుకూరి రామ్ చందర్ తెలిపారు.
సైకాలజిస్ట్ పున్నంచందర్ గత పదిహేను ఏండ్లుగా పలు మానసిక సమస్యల పరిష్కారానికి నూతన పద్ధతులను వినియోగిస్తూ, వ్యక్తిగత కౌన్సిలింగ్, వర్క్షాపులు మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు అని తెలిపారు.
ఈ సందర్భంలో సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ, "ఈ అవార్డు నాకు ఎంతో గొప్ప గౌరవం మరియు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంచడానికి నా సేవలు కొనసాగిస్తాను" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మోత్కూరు రామచందర్, సైకాలజిస్టులు పాల్గొన్నారు.
పున్నంచందర్ కు అవార్డ్ రావడం పట్ల సైకాలజిస్ట్ లు వై.ఆంజనేయులు, ఏ.ఈశ్వర్, శ్రీనివాస్, అయ్యప్ప రాము, తిరుమల పలువురు అభినందించారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >