Posted on 2025-06-15 17:43:30
డైలీ భారత్, సూర్యాపేట:కల్నల్ సంతోష్ బాబు 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల సంతోష్ బాబు వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమం నందు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హాజరై జిల్లా పోలీస్ శాఖ తరపున కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఘటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....
ఆర్మీ జవాన్ గా విరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులుభాషారు, వీరి త్యాగం వెలకట్టలేని అన్నారు. వీరి లోటు తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు చాలా బాధ కలిగిస్తుంది అయినప్పటికీ దేశ వ్యాప్తంగా కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని గుర్తించి నివాలర్పించడం, స్మరించుకోవడం ఆ కుటుంబానికి ఓదార్పు అన్నారు. ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణకు పౌరులు కృషి చేయాలని అన్నారు. యువత దేశానికి భవిష్యత్తు ఇలాంటి యువత నేడు చెడు వ్యసనాలకు గురై నిర్వీర్యం అవుతున్నారు, యువత కల్నల్ త్యాగాన్ని, ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్నల్ కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు, ఆర్మీ జవాన్లు సంక్షేమం సంఘం, NCC విద్యార్థులు, పౌరులు, పట్టణ ప్రముఖులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >