Posted on 2025-06-26 16:12:13
మూడు సెల్ ఫోన్స్, 30,000/- రూపాయలు స్వాధీనం.
వివరలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన JCB ఓనర్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేములవాడలో గల అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని అందులో చెట్లను చదును చేయడానికి జెసిబి కావాలని అందుకాను ముందస్తుగా ఎంట్రీ ఫీజు కోసం 9000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుందని మాయమాటలు చెప్పి నమ్మించి డబ్బులు స్కానర్ ద్వారా పంపించుకున్నారని, తరువాత అట్టి వ్యక్తులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపి తము మోసపోయానని గ్రహించి తంగాళ్ళపల్లి మండలం గండిలచ్చక్కపేట గ్రామానికి చెందిన మాల్యల శ్రీనివాస్ అనే వ్యక్తి పిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆట్టి నేరస్తులను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుని విచారించగా వీరితో పాటుగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఇద్దరిని,ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఇదేవిధంగా మోసం చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నామని వారు నేరం ఒప్పుకున్నారు.ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు మరియు 30,000/- రూపాయలు స్వాధీనం చేసుకోని ఈరోజు వారిని కోర్టుకు రిమాండ్ కు తరలించడం జరిగిందని సీఐ తెలిపారు
నిందుతుల వివరాలు.
1) గోల్కొండ చందు కుమార్ S/o రామచంద్రం, వయసు 28 సంవత్సరంలు, కులం మాదిగ, గ్రామం & మండలం. బాలాపూర్, జిల్లా రంగారెడ్డి.
2) చింతపట్టి పవన్ కుమార్ S/o రవీందర్, వయసు 25 సం..లు, కులం SC మాదిగ, గ్రామం & మండలం బాలాపూర్ జిల్లా రంగారెడ్డి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >