Posted on 2025-07-04 15:04:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో శనివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
శనివారంనాడు ఉదయం నిజామాబాద్, మధ్యహ్నం కామారెడ్డి జిల్లా లలో పర్యటిస్తున్నారని దళిత బహుజన ఫ్రంట్( డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్, కామారెడ్డి జిల్లా నాయకులు తలారి ప్రభాకర్, డిబిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీబీపేట్ ప్రభాకర్ లు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలక నిజామాబాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి, భూమి సమస్యలు,రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చులు,అన్ని శాఖల సమీక్ష చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా స్థాయి సమీక్ష ఉంటుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటనను సద్వినియోగం చేసుకొని బాధితులు తమ సమస్యల పై వినతిపత్రాలు సమర్పించవచ్చని తెలిపారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >