Posted on 2025-07-12 17:12:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లో దాదాపు తమ తాత ముత్తాతల తరం నుండి ఏళ్ల తరబడిగా ఊర పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని సర్వ సమాజ్ కమిటీ సభ్యుడు రవి తెలిపారు. పూర్వం గత్తర్ (ప్లేగు వ్యాధి) రావడంతో చాలామంది చనిపోయారని చెప్పారు. దీంతో అన్ని కులాల వారు కలిసి సర్వ సమాజ్ కమిటీగా ఏర్పడి గ్రామ దేవతలను తయారు చేయించి నిష్ఠతో కొలవడంతో వ్యాధి అంతమైందన్నారు. వ్యాధి తగ్గడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్లో ఈ నెల 13న ఊర పండుగను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిమల తయారీలో వడ్రంగులు నిమగ్నమయ్యారు. ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఈ పండుగకు ఐదు రోజుల పాటు నిష్టతో ఉండి 13 ప్రతిమలు తయారు చేస్తామని వడ్రంగి శ్రీనివాస్ తెలిపారు. దాదాపు 80 ఏళ్ల నుంచి మూడు తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఆయన చెప్పారు. మామిడి చెట్టు నుంచి తీసుకువచ్చిన కర్రతో మాత్రమే ప్రతిమలను తయారు చేస్తామని వారు వివరించారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >